Header Banner

హిందూపురం అది నా హృదయ స్పందన! ఈ సన్మానం మరువలేనిదంటూ బాలకృష్ణ..

  Fri May 09, 2025 18:09        Politics

పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హిందూపురం ప్రజల ఆదరణకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హిందూపురంలో జరిగిన సన్మాన సభను జీవితంలో మరువలేని అనుభూతిగా అభివర్ణించారు. ప్రజల అభిమానం తండ్రికి పిల్లలు చూపిన ఆత్మీయతలా అనిపించిందని వ్యాఖ్యానించారు. హిందూపురం కేవలం నియోజకవర్గం కాదని, తన హృదయ స్పందన అని ఉద్ఘాటించారు. ప్రజల ప్రేమకు జీవితాంతం నిస్వార్థ సేవతో బదులిస్తానని భావోద్వేగ హామీ ఇచ్చారు. "పద్మభూషణ్ అనే గౌరవప్రదమైన పురస్కారం లభించిన ఈ ఆనందకరమైన క్షణాల్లో, నా ప్రియమైన హిందూపురం ప్రజలు చూపిన ఆత్మీయత, ప్రేమ, ఆదరణ... నాకు చిరకాలంగా గుర్తుండిపోయే అనుభూతిని ప్రసాదించాయి. మీరు ఏర్పాటు చేసిన సన్మాన సభ... హృదయాన్ని తాకే మధుర ఘడియలు… నా జీవితంలో మరువలేని అనుభవంగా నిలిచిపోయింది. అది ఒక నాయకునికి ప్రజలిచ్చే గౌరవం కంటే... ఒక తండ్రికి తన పిల్లలు చూపే ఆత్మీయతలా అనిపించింది. మీరు చూపిన ఆ ప్రేమ ఒక శక్తిగా, ఆశీర్వాదంగా మారి, నా జీవితం మొత్తానికీ వెలుగులా నిలుస్తుంది. హిందూపురం నాకు ఓ నియోజకవర్గం కాదు... అది నా హృదయపు స్పందన.. నా హృదయంలో చిరకాలంగా తీయగా మోగే జననీ స్వరం... ప్రతి చిరునవ్వులో నన్ను నిలబెట్టిన నిస్వార్థ ప్రేమ స్థలం. మీరు ఇచ్చిన ప్రేమకు బదులివ్వలేను కానీ... జీవితాంతం మీ సేవలో నిస్వార్థంగా ఉండే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. మీరు చూపిన నిస్వార్థ ప్రేమకు నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ఈ గౌరవాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు.  మీ ప్రేమను ఈ జీవితంలో మరచిపోలేను" అని బాలయ్య సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations